వినికిడి యంత్రాల పంపిణీ శుభపరిణామం

1085பார்த்தது
పేద పిల్లలకు ఉపయోగపడే వినికిడి పరికరాలను స్వరూప స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అందించడం అభినందనీయమని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని ఎన్జీవో కళ్యాణమండపంలో స్వరూప చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో.. దాదాపు 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి పరికరాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్. కిరణ్ కుమార్ అతిథిగా హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி