పంట నమోదు పక్రియను పరిశీలించిన ఏవో

77பார்த்தது
పంట నమోదు పక్రియను పరిశీలించిన ఏవో
అద్దంకి మండలం కుంకుపాడులో బుధవారం పలువురు రైతుల పంట పొలాల వద్ద పంట నమోదు ప్రక్రియను ఏవో వెంకటకృష్ణ పరిశీలించారు. ఈ నెల 15వ తేదీ లోపు పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని వెంకటకృష్ణ వ్యవసాయ సిబ్బందికి సూచించారు. పంట నమోదు చేయించుకున్న వారికి మాత్రమే భీమా వస్తుందని ఆయన పేర్కొన్నారు. గిట్టుబాటు ధర, పంటల బీమా, సున్నా వడ్డీ వంటి పథకాలు పంట నమోదు తోనే సాధ్యమని వెంకటకృష్ణ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி