ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీలో వరద నష్టం ఇలా

62பார்த்தது
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీలో వరద నష్టం ఇలా
ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 19 మంది మృతి చెందగా.. ఇద్దరు గల్లంతైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. 136 పశువులు మరణించినట్లు తెలిపింది. 1,72,542 హెక్టార్ల వరి, 14,959 హెక్టార్ల ఉద్యాన పంటలు, 1,808 కి.మీ. మేర రోడ్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. 176 పునరావాస కేంద్రాలకు 41,927 మందిని తరలించామని, బాధితులకు 3 లక్షల ఆహార ప్యాకెట్లు అందించామని ప్రకటించింది. సాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி