ఇంతవరకు ఒక్క మేలైన కార్యక్రమం చేపట్టలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క మేలైన కార్యక్రమం కూడా చేపట్టలేదని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో రాజయ్య శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రాజముద్రను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందంటు ప్రశ్నించారు. అందులో కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తుంటే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி