ఎస్బిఐ బ్యాంక్ ముందు ధర్నా

కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాళ్లగూడెం గ్రామంలో ఎస్బిఐ బ్యాంక్ నందు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో బ్యాంక్ లు రైతుల అకౌంట్లు వెంటనే హోల్డ్ లో నుండి తొలగించాలి అని, ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ అందచేయాలని, రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని, పాత రుణాలను రెన్యూవల్ చేసి జీరో వడ్డీకే రాయితీని రైతుల ఖాతాలో వేయాలని, డ్వాక్రా రుణాలు వడ్డీ భారం తగ్గించాలని కోరుతూ, తాళ్లగూడెం ఎస్బిఐ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్బిఐ మేనేజర్ శివకుమార్ కి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు- గింజల నర్సిరెడ్డి, జడ్పీటీసీ - బాణోత్ వెంకట ప్రవీణ్ నాయిక్, ఎంపీటీసీ - నల్లమోతు లక్ష్మయ్య, మాలోత్ శంకర్ నాయక్, సర్పంచ్ -లకావత్ సునీత, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్- డి. సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు -నల్లమోతు వెంకటనర్సయ్య, రాంబాబు, బాలబోయిన వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி