9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్

61பார்த்தது
9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్
తెలంగాణలో 9 యూనివర్సిటీలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం వీసీలను నియమించింది. పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌, KU వీసీగా ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి, OU వీసీగా కుమార్‌, SU వీసీగా ఉమేష్‌కుమార్‌, తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్‌, తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరిరావు, వ్యవసాయ వర్సిటీ వీసీగా అల్దాస్‌ జానయ్య, ఉద్యానవన వర్సిటీ వీసీగా రాజిరెడ్డిలను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.