జిల్లాలో వంద శాతం పోలింగ్ నమోదు చేసేందుకు ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మెప్మా ప్రాజెక్టు అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏ. పి. డిలు పేర్కొన్నారు. మంగళవారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా కాజీపేట, సిఆర్సి సెంటర్ నుండి కాజీపేట ట్రాఫిక్ జంక్షన్ వరకు స్వయం సహాయక సంఘాల సభ్యులు, రిసోర్స్ పర్సన్లు మరియు నగర ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.