హనుమకొండ: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఆయా గ్రామ పంచాయతీల వార్డుల వారిగా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గ్రామపంచాయతీల ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా రూపకల్పన పై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.