రెండో బోటును ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు

51பார்த்தது
రెండో బోటును ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు
ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న రెండో బోటును బెకెం ఇంజినీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. ఇనుప గడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవను వెలికి తీశారు. నీటమునిగిన పడవను చైన్‌ పుల్లర్‌తో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువన పున్నమి ఘాట్‌ వద్దకు చేర్చారు. బ్యారేజీ వద్ద ఇంకా మరో భారీ బోటు, మోస్తరు బోటు నదిలో ఉన్నాయి. శుక్రవారం మూడో బోటును ఒడ్డుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி