వరంగల్ జాతీయ రహాదారిపై టాటా ఏసీ బొల్తాపడి ఒకరూ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. బాదితుల వివరాల ప్రకారం జోడిమెట్లా నుంచి రాయిగిరికి టాటా ఏసీ సిమెంట్ బిల్లలు తీసుకెళ్తుడంగా భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలని వద్ద రోడ్డు డివైడర్ పైకి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. నలుగురు కూలీలలో బిహార్కు చెందిన ముఖేష్ మృతి చెందాడు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరళించారు.