తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ను కోరింది. అయితే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఇటీవల విచారించిన కోర్టు స్పీకర్కు కొంత సమయం ఇచ్చింది. ఈ క్రమంలో నేడు తుది విచారణ చేపట్టే అవకాశం ఉంది.