ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. ఓ దశలో దూకుడుగా ఆడిన శుభ్మన్ గిల్ (46)ను 17.3 ఓవర్లో అబ్రార్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ తర్వాత గిల్ను చూస్తూ వెళ్లు.. వెళ్లు.. అన్నట్టుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.