సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం

80பார்த்தது
సంగారెడ్డి పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మురుగు కాల్వలు లేకపోవడంతో వర్షపునీరు రోడ్డు పైనే నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

தொடர்புடைய செய்தி