SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటికి తీయడానికి రెండు రోజులుగా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం మంగళవారం మూడు బృందాలను రంగంలోకి దింపింది. టన్నెల్లో బురద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.