ఖానాపూర్ మండలంలో ముగిసిన క్రికెట్ పోటీలు

65பார்த்தது
ఖానాపూర్ మండలంలో ముగిసిన క్రికెట్ పోటీలు
ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ లో నిర్వహించిన క్రికెట్ పోటీలు గురువారంతో ముగిసినట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొనగా, ఈగల్, టైటాన్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయని తెలిపారు. గురువారం చివరి మ్యాచ్ లో ఈగల్ జట్టు విజయం సాధించి మొదటి బహుమతిగా రూ 10 వేలు గెలుచుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి సిఐ సైదారావుతో పాటు మహేందర్, తదితరులు పాల్గొన్నారు.