ఎలుకలు పడితేనే పైసలు.. లేదంటే పస్తులే

65பார்த்தது
ఎలుకలు పడితేనే పైసలు.. లేదంటే పస్తులే
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన రోశయ్య నల్గొండ జిల్లాకు వలస వచ్చి బతుకు దెరువు కోసం రైతుల పంట పొలాల్లో ఎలుక బోన్ లు పెడుతున్నామన్నారు. రోజుకు 200 బుట్టలు పెడుతున్నామని 40, 50 ఎలుకలు పడుతున్నాయని ఒక్కో ఎలుకకు 15 రూపాయలు తీసుకుంటున్నామని, ఎలుకలు పడితేనే పైసలు వస్తాయని లేదంటే పస్తులు ఉంటున్నామని రోశయ్య శనివారం తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி