దేవరకొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.. సెక్రటేరియట్, అమర జ్యోతి, అంబేద్కర్ విగ్రహాల కూడలిలో సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పట్టణంలో బిఆర్ఎస్ శ్రేణులు పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.