తెలంగాణాలో అటవీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో అటవీ శాఖపై ఆమె మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల అధికమైన నేపథ్యంలో అడవులను సంరక్షించి, పచ్చదనం పెంచడం అత్యంత అవసరం. తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో అటవీ శాఖకు రూ.1,023 కోట్లను కేటాయించింది. అటవీ విస్తీర్ణాన్ని 23% నుంచి 33% వరకు పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం." అని అన్నారు.