అంధకారంలో రైల్వేస్టేషన్ రోడ్డు

82பார்த்தது
తాండూర్ మండలం స్థానిక రేచిని రైల్వే స్టేషన్ రోడ్డులో వీధి దీపాలు లేక ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే.. రహదారి గుండా వీధి దీపాలు లేకా అంధకారం అలుముకొవడంతో ప్రయాణికులు అటువైపు రావడానికి భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి గుండా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி