వైద్య శిబిరంను సందర్శించిన డిప్యూటీ డిఎం అండ్‌హెచ్‌ఓ

65பார்த்தது
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ డిఎంహెచ్వో సుధాకర్ నాయక్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఇంక్లైన్ బస్తిలో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. బస్తీల్లో ఏర్పాటు చేసే శిబిరాల్లో బీపీ, షుగర్ పరీక్షలు చేస్తామని, రక్త పరీక్షల కోసం అర్బన్ హెల్త్ సెంటర్, వందదపడగల దవాఖానకు వెళ్లాలని సూచించారు.