అధికారులు అందించిన సహకారం మరువలేనిది: సరిత

69பார்த்தது
అధికారులు అందించిన సహకారం మరువలేనిది: సరిత
జోగులంబ గద్వాల జిల్లా అధికారులు ఐదు సంవత్సరాల తన పదవీకాలంలో అందించిన సేవలు మరువలేనివని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత పేర్కొన్నారు. ఆమె పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం పాత ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కలెక్టర్ సంతోశ్ తో పాటు వివిధ శాఖల అధికారులను సరిత శాలువాతో సన్మానించారు. ఐదు సంవత్సరాల పాటు తనకు సహకారం అందించడం పట్ల అధికారులకు జడ్పీ చైర్మన్ సరిత కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி