సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం

79பார்த்தது
ఈనెల 18న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో నేటి తరానికి తెలిసేలా ఆ వారసత్వాన్ని కొనసాగిద్దామని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పుల్లయ్య అన్నారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమేనని శనివారం కొణిజర్లలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిందని, హిందూ ముస్లింల ఐకమత్యం కోసం సాగిందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி