ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. కేజ్రీవాల్కు ఆత్మాభిమానం ఉంటే బెయిల్ తీసుకుని ఉండాల్సింది కాదని అన్నారు. కేజ్రీవాల్కు సిగ్గులేదని వ్యాఖ్యానించారు. ‘ఆత్మాభిమానం ఉన్న ఎవరైనా అలాంటి బెయిల్పై జైలు నుంచి బయటికి రారు. తనకు అలాంటి బెయిల్ వద్దని కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు చెప్పి ఉండాల్సింది. కానీ అతనికి సిగ్గులేదు’ అని పరుష వ్యాఖ్యలు చేశారు.