వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సదన్ లోని పురాతనమైన పరమేశ్వర సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మాస శివరాత్రి నేపథ్యంలో ప్రదోషకాలంలో అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ప్రతి సోమవారం ప్రదర్శ కాలంలో ఇక్కడ పూజ అభిషేక కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి అలంకరణ అందర్నీ ఆకట్టుకుంటుంది.