సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సింగసముద్రం పెద్దకాలువకు ఆదివారం గండి పడింది. భారీ వర్షాలకు వరద ఉదృతి పెరగడంతో గండిపడింది. తక్షణమే నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాల్వకు పడిన గండి పెద్దగా మారితే వేలాది ఎకరాల పంటలు నష్టపోయి ప్రమాదం ఉన్నదని స్థానికులు తెలిపారు.