సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో శ్రీ రంగనాయకస్వామి రథోత్సవ వేడుకలో శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయక స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.