భూ ఆరోపణలపై స్పంచిందిన అడ్లూరి

1021பார்த்தது
మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదాల్లో అనవసరంగా తన పేరును వాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మల్లారెడ్డి అంటే భూ కబ్జా, భూ కబ్జా అంటే మల్లారెడ్డి అని విమర్శించారు. మూడు సంవత్సరాల క్రితమే నాకు సంబందించిన 600 గజాల భూమిని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి విక్రయించానని, ప్రస్తుతం ఆ భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. కానీ తాను ఎవరినో అనుచరులను పంపించి భూమిని కబ్జా చేసినట్లు నాపై తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని, వెంటనే తనపై చేసిన ఆరోపణలను మల్లారెడ్డి వెనక్కి తీసుకోవాలి విప్ లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி