ఇంటి యజమానులు 5 శాతం రిబేట్ ను సద్వినియోగం చేసుకోండి

66பார்த்தது
ఇంటి యజమానులు 5 శాతం రిబేట్ ను సద్వినియోగం చేసుకోండి
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులు, తమ ఇంటి ఆస్తి పన్నులను 5శాతం రిబేట్ తో ఈ నెల 30లోగా చెల్లించి, మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కోరారు. శనివారం కమీషనర్, వార్డు అధికారులు, సిబ్బందిచే ఇంటి పన్నుల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో 5శాతం రిబేట్ కు అనూహ్య స్పందన వస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி