17 లక్షల విలువైన 38 పట్టు చీరలను దొంగిలించినందుకు నలుగురు మహిళలను అరెస్టు చేశామని, ఇద్దరు మహిళలు ఇంకా పరారీలో ఉన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద మంగళవారం తెలిపారు. నిందితులు ఓ దుకాణంలోకి ప్రవేశించి సుమారు 18 చీరలను చోరీకి యత్నించగా అప్రమత్తమైన సిబ్బంది వాటిని అడ్డుకున్నారని తెలిపారు. వారు ఇలాంటి నేరాలకు తరుచూ పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.