ఊర చెరువు కాలువకు మరమ్మతులు

50பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని 24వార్డులో ఊరకుంట చెరువు నుంచి వస్తున్న వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెసిబి సహాయంతో శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. 6 ఆర్సిసి పైపులను అమర్చారు. సమస్యను తీర్చినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మల్లికార్జున్, వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி