వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎస్పీ పూజలు

51பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన గణనాథుడి వద్ద బుధవారం రాత్రి ఎస్పీ జానకి దరావత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆమెను ఆలయ మర్యాదల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలంతా సంతోషంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ సీఐ అప్పయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி