డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే వాటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. డ్రై ఫ్రూట్స్నునానబెట్టి తీసుకోవడం వల్ల అవి తేలికగా జీర్ణమై.. శరీరం వేగంగా పోషకాలను గ్రహిస్తుందని నిపుణులు అంటున్నారు.