శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణస్వీకారం

80பார்த்தது
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణస్వీకారం
శ్రీలంక నుతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. కొలంబోలోని రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య.. దిసనాయకేతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, అవినీతిని నిర్మూలిస్తారనే ప్రజల ఆకాంక్షల మధ్య దిసనాయకే శ్రీలంక అధ్యక్ష పీఠం ఎక్కారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఎన్​పీపీ నాయకుడైన దిసనాయకే, తన సమీప ప్రత్యర్థి, ఎస్​జేబీ నాయకుడైన సాజిత్ ప్రేమదాసపై గెలుపొందారు.

தொடர்புடைய செய்தி