బయోటెక్నాలజీ రంగంలో అగ్రశ్రేణి సంస్థ ఆమ్జెన్ ఇండియా ఫెసిలిటీ సైట్ను CM రేవంత్ ప్రారంభించారు. గత ఆగస్టులో అమెరికా పర్యటించిన సందర్భంగా ఆమ్జెన్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, తాజాగా మాదాపూర్లో ఆమ్జెన్ ఇండియా ఫెసిలిటీ సైట్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన బయోటెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ తన మొట్టమొదటి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో స్థాపించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.