అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న కొత్త సినిమా షూటింగ్ ఈ నెలలో మొదలవుతుందన్న వార్తలను నిర్మాత నాగవంశీ ఖండించారు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. బన్నీ-త్రివిక్రమ్ మూవీ ఇప్పుడే స్టార్ట్ కాదు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొదలవుతుంది అంటూ నాగవంశీ తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశపడ్డారు.