AP: టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేయగా.. కొత్త చైర్మన్గా సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎవరిని నియమించనుందనే విషయం చర్చగా మారింది. కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు అయిన అశోక్ గజపతిరాజుకు ఈ ప్రతిష్టాత్మక పదవి దక్కనుందని ప్రచారం సాగుతోంది. ఆధ్యాత్మిక భావాలు నిండుగా ఉన్న గజపతికి ఈ పవిత్రమైన బాధ్యతలు అప్పగించాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట.