రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

57பார்த்தது
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
చెన్నూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి 63 మార్గంలోని మార్కెట్ యార్డు ఎదుట గురువారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మహారాష్ట్ర కు చెందిన రమేష్, స్నేహాల్, సాగర్ ముగ్గురు యువకులు చెన్నూర్ నుంచి తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

தொடர்புடைய செய்தி