హైదరాబాద్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

52பார்த்தது
TG: హైదరాబాద్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను టాస్క్ ఫోర్క్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఆహార భద్రత, టాస్క్ ఫోర్క్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ చికెన్ సెంటర్‌లో కుళ్లిన కోడి మాంసం, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి.. ఫాస్టుఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో చికెన్ సెంటర్ యజమానిపై కేసు నమోదు చేసి, ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.

தொடர்புடைய செய்தி