కడపలో మూడు చోట్ల దొంగల బీభత్సం (వీడియో)

78பார்த்தது
వైఎస్సార్ జిల్లా కడపలో నిన్న అర్ధరాత్రి మూడు చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కడప నగరంతో పాటు ఒంటిమిట్టలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డారు. ఒంటిమిట్టలోని ఏటీఎంలో దుండగులు రూ.36 లక్షలు కాజేశారు. ద్వారకానగర్ పరిధిలోని ఏటీఎంలో రూ.6 లక్షలు చోరీ చేశారు. విశ్వేశ్వరయ్య కూడలిలో మరో ఏటీఎం వద్ద చోరీకి యత్నించారు. చోరీలకు పాల్పడిన వారు హరియాణాకు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி