నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే

80பார்த்தது
నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే
నూతన ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్సులను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం మార్కాపురం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో జరిగింది. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఏపీఎస్ఆర్టీసీ డిపో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. 1970వ సంవత్సరం నుంచి మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రజలకు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி