భారీ వర్షాలు.. ఏపీలో 10 మంది దుర్మరణం!

56பார்த்தது
భారీ వర్షాలు.. ఏపీలో 10 మంది దుర్మరణం!
భారీ వర్షాలకు ఏపీలోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో డ్రెయిన్‌లో కారు కొట్టుకుపోయి ముగ్గురు మరణించారు. అలాగే మంగళగిరి గండాలయపేటలో కొండచరియలు విరిగి నాగరత్నమ్మ అనే వృద్ధురాలిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

தொடர்புடைய செய்தி