భారీ వర్షాలకు ఏపీలోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో డ్రెయిన్లో కారు కొట్టుకుపోయి ముగ్గురు మరణించారు. అలాగే మంగళగిరి గండాలయపేటలో కొండచరియలు విరిగి నాగరత్నమ్మ అనే వృద్ధురాలిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.