మహాత్ముని చేతికర్ర వేటపాలెంలో ఇప్పటికీ భద్రం

73பார்த்தது
మహాత్మా గాంధీజీ ఉపయోగించిన చేతి కర్ర నేటికీ వేటపాలెం లైబ్రరీలో ఉంది. 1918 లో వేటపాలెంలో వి. వి. శ్రేష్టి నిర్మించాలనుకున్న సారస్వతనికేతనం భవనానికి 1929లో మహాత్ముడు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో జాతిపితను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి గాంధీజీ చేతి కర్ర విరిగిపోయింది. బాపూ ఆ కర్రను అక్కడే వదిలివెళ్లారు. అప్పటి నుండి జాతిపిత చేతికర్ర ఇప్పటికీ గ్రంథాలయంలో భద్రంగా ఉంది.

தொடர்புடைய செய்தி