చీరాల : అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు

81பார்த்தது
చీరాల సంత బజారులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు గుంటూరు మాధవరావు ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం అమ్మవారు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. కూరగాయలతో అమ్మవారిని అలంకరించిన తీరు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కుంకుమ పూజ జరిగాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భజనలు కూడా జరిగాయి.

தொடர்புடைய செய்தி