నూరు శాతం నష్టపరిహారం అందించాలి

74பார்த்தது
అమరావతి మండల పరిధిలోని పెదమద్దూరు, సేవపాడు, ఎండ్రాయి, ఉంగుటూరు, వైకుంఠపురం, మల్లాది, జూపూడి, మునుగోడు గ్రామాలలో వరద ముంపుకు పాడైపోయిన పత్తి రైతులకు నూరు శాతం నష్టపరిహారం అందించాలని శుక్రవారం రైతులు కోరారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత పత్తి మొక్కలు ఉడకెత్తి పూర్తిగా ఎండిపోయాయని రైతులు ఆవేదన చెందారు. అధిక శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నామని నష్టపరిహారం అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி