వైసీపీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం: అంబటి

50பார்த்தது
గుంటూరు జిల్లాల్లో వైసీపీ పూర్వ వైభవానికి కృషిచేస్తానని గుంటూరు జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. విద్యానగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అంబటి మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులను కలుపుకొని పార్టీని పటిష్టం చేసి తిరిగి అధికారంలోకి తీసుకొని వస్తామని ధీమావ్యక్తం చేశారు. 4న పదవి ప్రమాణస్వీకారోత్సవ సభ జరుగుతుందని, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி