భువనగిరి: అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు

52பார்த்தது
భువనగిరిలోని రైతు బజార్ ప్రక్కన ప్రభుత్వ స్థలంలో కొందరు అనుమతి లేకుండా డబ్బాలు నిర్మించుకున్నారు. స్థానికులు భువనగిరి తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు అక్రమంగా నిర్మించిన డబ్బాలను తొలగించారు. ప్రభుత్వ స్థలాలలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు

தொடர்புடைய செய்தி