రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

1557பார்த்தது
రైలు ఢీకొని వృద్ధురాలి మృతి
పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. గీసుకొండ మండలం ధర్మారం ప్రాంతానికి చెందిన గట్టికొప్పుల ఎల్లమ్మ కొడుకు రాంబాబు ఇంటి నుంచి రైలు పట్టాలకు అటువైపు ఉండే పెద్ద కొడుకు రమేశ్ ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక క్కడే మృతిచెందింది.