వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో మంగళవారం సుమారు ఆరు గంటలకు పైగా విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. సాయంత్రం 4. 30 గంటలకు పోయిన కరెంటు రాత్రి 9. 30 గంటల వరకు వచ్చింది. ఆస్పత్రిలోని జనరేటర్ల ద్వారా ఎమర్జెన్సీ వార్డులకు కరెంటు అందించారు. చాలా వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు బయటకు వచ్చారు. వేసవి ఉక్కపోతకు ఇబ్బంది పడ్డారు. కరెంట్ పోవడానికి గలా కారణాలు తెలియరాలేదు.