పద్మశ్రీ గడ్డం సమ్మయ్య కు ఘనంగా సన్మానం

77பார்த்தது
పద్మశ్రీ గడ్డం సమ్మయ్య కు ఘనంగా సన్మానం
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో ప్రముఖ చిందు యక్షగాన కళాకారులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్య కు అభినందన సత్కార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు శ్రీహరి, యశస్వినిరెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி