మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు 22వ వార్డు పరిధిలోని అంగన్వాడి కేంద్ర ఆరోగ్య శుద్ధ్య పోషణ దినోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నీరజారెడ్డి ధర్మన్నలు మాట్లాడుతూ వర్షాకాలం సందర్భంగా పిల్లలు గర్భిణీ స్త్రీలు అనారోగ్యం బారిన పడకుండా పౌష్టికాహారం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. పిల్లలు గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం తీసుకొని తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.